దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది తిరుమల లడ్డు కేసు. ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీటీడీ మాజీ చైర్మన్ పీఏ అప్పన్నకు నోటీసులు ఇచ్చింది ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్). తనను తిరుపతి సిట్ కార్యాలయంలో ప్రశ్నించడం కలకలం రేపింది. గత మూడు రోజులుగా ఈ విచారణ కొనసాగుతోందని సమాచారం.