ఈ విజయం ఫ్యాన్స్ కు అంకితం
NEWS Jun 04,2025 09:33 am
ఆర్సీబీ ఐపీఎల్ 2025 కప్ ను సాధించడం పట్ల తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు విరాట్ కోహ్లీ. 18 ఏళ్ల పాటు ఆ జట్టుతోనే ఉన్నానని చెప్పాడు. జట్టులో కీలక పాత్ర పోషించడం పట్ల సంతోషంగా ఉందన్నాడు. సుదీర్గ విరామం తర్వాత కప్ అందుకోవడం మరిచి పోలేనని అన్నాడు. నా ఆత్మ, హృదయం రెండూ ఈ జట్టుతోనే ఉన్నాయని, వేరే ఆలోచన అనేది రాలేదన్నాడు. చాలా ఫ్రాంచైజీలు తనను తీసుకోవాలని అనుకున్నాయని, కానీ నేను ఒప్పుకోలేదని పేర్కొన్నాడు. ఈ గెలుపును ఆర్సీబీ ఫ్యాన్స్ కు అంకితం ఇస్తున్నామని చెప్పాడు.