సీఎం బాబును కలిసిన డీజీపీ గుప్తా
NEWS Jun 02,2025 01:07 pm
ఏపీ నూతన డీజీపీగా నియమితులైన హరీశ్ కుమార్ గుప్తా మర్యాద పూర్వకంగా సోమవారం సచివాలయంలో సీఎం చంద్రబాబును కలుసుకున్నారు. ఇప్పటి వరకు గుప్తా ఇంచార్జి డీజీపీగా వ్యవహరించారు. తాజాగా కూటమి సర్కార్ పూర్తి స్థాయి డీజీపీగా కేంద్రానికి సిఫారసు చేసింది. ఈ మేరకు అక్కడి నుంచి లైన్ క్లియర్ కావడంతో డీజీపీగా బాధ్యతలు చేపట్టారు.