రాష్ట్ర అవతరణ వేడుకల్లో నేరెళ్ల శారద
NEWS Jun 02,2025 01:09 pm
పెద్దపల్లి జిల్లా కేంద్రం లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద. అనంతం రైతులకు నాణ్యమైన విత్తనాలను పంపిణీ చేశారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ లో పేదల సంక్షేమం, సమగ్ర పాలసీల రూపకల్పన, ప్రపంచ స్థాయి ఇన్ఫ్రా డెవలప్మెంట్, పారదర్శక సుపరిపాలనపై ఫోకస్ పెట్టామన్నారు.