పోలీస్ శాఖలో విశేషమైన సేవలందించిన పలువురు పోలీస్ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిషాత్మకమైన పోలీస్ పతకాలను అందుకోనున్నట్లు జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పోలీస్ పతకాలకు ఎంపిక అయిన సిబ్బంది ని జిల్లా ఎస్పీ అభినందించారు. విధి నిర్వహణలో భాగంగా కష్టించి పనిచేసే వారికి గుర్తింపు వస్తుందన్నారు. రానున్న రోజుల్లో కూడా ప్రజలకు ఉత్తమమైన సేవలు అందించి విధి నిర్వహణలో నిజాయితీని కనబరుస్తూ మరెన్నో అందుకోవాలని ఎస్పి ఆకాంక్షించారు.