టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా మల్లు రవి
NEWS Jun 01,2025 08:00 pm
టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం గాంధీ భవన్ లో చిన్నారెడ్డి నుంచి ఛార్జ్ తీసుకున్నారు. తనకు ఈ బాధ్యత ఇచ్చిన కాంగ్రెస్ హైకమాండ్ కు ధన్యవాదాలు చెప్పారు. చిన్న కార్యకర్త నుంచి పెద్ద నాయకుడి వరకూ అందరూ లక్ష్మణ రేఖ దాటకుండా క్రమశిక్షణగా ఉండాలని సూచించారు.