ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ మర్యాద పూర్వకంగా ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కలుసుకున్నారు. ఇటీవలే రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా దేశంలోనే అత్యున్నత పౌర పుసర్కారం పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. స్వయంగా సీఎం మందకృష్ణను శాలువా కప్పి సన్మానం చేశారు. తన జాతి కోసం కొన్నేళ్లపాటు కృషి చేశారని కొనియాడారు.