ముస్లింల ఓట్లు పొందేందుకే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆపరేషన్ సిందూర్ పై నోరు పారేసుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు కేంద్ర మంత్రి అమిత్ షా. ఓ వైపు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడుతుంటే కనీసం స్పందించక పోవడం దారుణమన్నారు. పైగా చులకన చేసి మాట్లాడటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తను బేషరతుగా భారత జాతికి క్షమాపణ చెప్పి తీరాల్సిందేనంటూ డిమాండ్ చేశారు షా.