దేశంలో కరోనా కేసుల సంఖ్య 3,395
NEWS Jun 01,2025 03:28 pm
మరోసారి కరోనా భయ పెడుతోంది. రోజు రోజుకు దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 3,395 కోవిడ్ కేసులు నమోదైనట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కేరళలో అత్యధికంగా నమోదు కాగా రెండో స్థానంలో ఢిల్లీలో కరోనా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 467 కేసులు నమోదు కాగా గుజరాత్ లో 265 , కర్ణాటకలో 234, పశ్చిమ బెంగాల్ లో 205, తమిళనాడులో 185, ఉత్తర ప్రదేశ్ లో 117 కేసులు నమోదు కావడం గమనార్హం. ఢిల్లీలో ఇప్పటి వరకు 375 కేసులు నమోదయ్యాయి.