మంగళవారం రాజారాంపల్లి సంత బంద్
NEWS Jun 01,2025 07:53 pm
ఎండపల్లి మండలం రాజారాంపల్లి పశువుల వారసంత మంగళవారం బంద్ కానుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పేరుగాంచిన పశువుల వారసంతలో ఒకటిగా పేరుగాంచింది. ఈనెల 7 న బక్రీద్ పండుగ పర్వదినం సందర్భంగా ముందస్తుగా ఇదివరకే పశువుల అక్రమ రవాణా నియంత్రణకు రాజారాంపల్లిలో తనిఖీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది పోలీసు శాఖ . మంగళవారం పశువుల వారసంత నిర్వహించకూడదని గుత్తేదారు, నిర్వాహకులను ఆదేశించారు పోలీసులు.