హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే మిస్ వరల్డ్ అందాల పోటీల్లో ఈ ఏడాది థాయ్లాండ్కు చెందిన ఓపల్ సుచాత చువాంగ్ విజేతగా నిలిచారు. తన పేరును ప్రకటించగానే ఓపల్ సుచాత భావోద్వేగానికి లోనయ్యారు. 2025 సంవత్సరానికి గాను ప్రపంచ సుందరి కిరీటాన్ని ఆమె కైవసం చేసుకున్నారు. మిస్ వరల్డ్ పోటీల్లో 108 దేశాలకు చెందిన కంటెస్టెంట్లు పాల్గొన్నారు.