తిరుమల క్యూ లైన్లో భక్తుల నరక యాతన
NEWS May 31,2025 01:19 pm
తిరుమలకు భక్తులు పోటెత్తారు. శ్రీవారి దర్శనం కోసం భక్తులు తరలి వస్తున్నారు. గంటల తరబడి క్యూ లైన్ లో నిల్చున్నారు భక్తులు. కనీస సౌకర్యాలు కల్పించడం లేదంటూ టీటీడీ పై భగ్గుమన్నారు . సామాన్య భక్తులను కాదని వీఐపీ దర్శనాలకు ప్రయారిటీ ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్యూలైన్లో వేచి ఉన్న పసి పిల్లలు, మహిళలకు కనీస సౌకర్యాలు కూడా లేవంటూ వాపోయారు.