ఏపీలో మెగా డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ ను ఖరారు చేసింది. జూన్ 6 నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ప్రతి రోజూ రెండు సెషన్లుగా ఉంటుంది పరీక్ష. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్ జరుగుతుంది. రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.