ఐపీఎల్ 2025లో సూపర్ సెంచరీతో అదరగొట్టిన 14 ఏళ్ల బీహార్ కుర్రాడు వైభవ్ సూర్య వంశీని ప్రశంసించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పాట్నా పర్యటనలో ఉన్న తనను మర్యాద పూర్వకంగా కలిశారు వైభవ్ తో పాటు పేరెంట్స్. యంగ్ క్రికెటింగ్ సెన్సేషన్ అంటూ పేర్కొన్నారు. అద్భుతంగా ఆడావంటూ ప్రశంసించారు. రాబోయే రోజుల్లో భారత దేశానికి ప్రాతినిధ్యం వహించేలా కృషి చేయాలని సూచించారు మోదీ. తనను కలవడం ఆనందంగా ఉందన్నాడు. యువత తనను చూసి స్పూర్తి పొందాలని సూచించాడు.