గంజాయి తరలిస్తున్న ఐదుగురు అరెస్ట్
NEWS May 31,2025 06:32 pm
గంజాయి తరలిస్తున్న ఐదుగురు వ్యక్తులను శనివారం మైలవరంలో పోలీసులు అరెస్టు చేశారు. పట్టణానికి చెందిన ఇద్దరు నూజివీడుకు చెందిన ఇద్దరు సత్తుపల్ కి చెందిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని ఎస్సై సుధాకర్ వెల్లడించారు. వారంతా చెడు వ్యసనాలకు బానిసై, సుదూర ప్రాంతాల నుంచి గంజాయి తీసుకొచ్చి మైలవరంలో విక్రయిస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు. వారి వద్ద నుండి 2.70 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.