శాతవాహన విశ్వవిద్యాలయంలో చరిత్ర, టూరిజం విభాగ ఏర్పాటుకు వినతి
NEWS May 30,2025 03:51 pm
శాతవాహన రిజిస్ట్రార్ ఆచార్య జాస్తి రవి కుమార్ ని రాష్ట్ర చరిత్ర పరిరక్షణ సమితి కలిసి చరిత్ర, టూరిజం విభాగాన్ని ఏర్పాటు చేయాలని, అలాగే శాతవాహనుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు. రిజిస్ట్రార్, శాతావానుడి విగ్రహం ఏర్పాటుకు ఉపకులపతి ఉమేష్ కుమార్ ఏర్పాటు చేస్తారని, వచ్చే ఏడాది చరిత్ర, టూరిజం విభాగానికి కృషి చేస్తామన్నారు. చరిత్ర పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు డా. పోతరవేణి తిరుపతి, డా. సందవేణి తిరుపతి, కేరళ యూనివర్సిటీ ప్రొఫెసర్ గుజ్జెటి తిరుపతి, రాజేందర్, పుష్పలత, రమేష్, డా. టి.శ్రీనివాస్, డా.ఏ. కుమార స్వామి పాల్గొన్నారు.