ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం
NEWS May 29,2025 06:17 pm
TG రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. పైలట్ ప్రాజెక్ట్ కింద 47,335 ఇళ్లను మంజూరు చేసినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ పథకం కింద ఇప్పటివరకు 7,824 ఇళ్లు బేస్మెంట్ స్థాయి, 895 ఇళ్లు గోడల నిర్మాణం, 64 ఇళ్లు శ్లాబ్ నిర్మాణం పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఈ పథకం కోసం రూ.68.08 కోట్ల నిధులను లబ్ధిదారులకు అందజేసినట్లు మంత్రి పేర్కొన్నారు. త్వరలోనే ఈ ఇళ్లకు గృహప్రవేశాలు జరపనున్నట్లు తెలిపారు. లబ్ధిదారుల ఆహ్వానం మేరకు వీలైన చోట్ల గృహప్రవేశ కార్యక్రమాలకు హాజరవుతానని ఆయన హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల సొంత ఇంటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, నిర్మాణ పనులు వేగవంతంగా సాగేలా అధికారులు కృషి చేస్తున్నారని మంత్రి సమీక్ష సమావేశంలో స్పష్టం చేశారు.