ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో పెద్ద జయంతి సందర్భంగా హనుమాన్ దీక్షాపరులు సమర్పించిన ఇరుముడులను (ముడుపులను) ఈవో శ్రీకాంత్ రావు ఆధ్వర్యంలో విప్పారు. ఈ ముడుపుల ద్వారా రూ. 1,65,641నగదు సమకూరినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పర్యవేక్షణ అధికారి రాజమౌళి, సునీల్, చంద్రశేఖర్, హరి హరనాథ్, పోలీసు సిబ్బంది, శ్రీ రాజరాజేశ్వర సేవా సమితి, తదితరులు పాల్గొన్నారు.