మళ్ళీ హడలెత్తిస్తోన్న కరోనా
NEWS May 29,2025 11:26 am
దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీలో అత్యధిక కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. భారత్లో యాక్టివ్ కేసుల సంఖ్య 1010కి చేరినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. కేరళను కరోనా కేసులు మరోసారి వణికిస్తున్నాయి. ఇప్పటివరకు 519 కేసులు నమోదు అయినట్లు, 3 మరణాలు సంభవించినట్లు కేరళ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశ ప్రజలు అలెర్ట్గా ఉండాలని కేంద్రం సూచిస్తోంది.