ప్లే ఆఫ్స్ మ్యాచ్ లకు భారీ భద్రత
NEWS May 29,2025 09:22 am
భారత్, పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025 ప్లే ఆఫ్స్ మ్యాచ్ లకు భారీ ఎత్తున భద్రతను ఏర్పాటు చేశారు. బీసీసీఐ సూచనల మేరకు హై సెక్యూరిటీని కల్పించారు. ముల్లాన్ పూర్ లో ఇవాళ క్వాలిఫయిర్ మ్యాచ్ జరగనుంది. ఈ వేదికపై నువ్వా నేనా అన్న రీతిలో తలపడనున్నాయి జట్లు. మొత్తం 10 జట్లు పాల్గొనగా ఆరు జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించాయి. ఇవాల్టితో జరిగే మ్యాచ్ లో గెలుపొందిన జట్టు నేరుగా ఫైనల్ కు చేరుకుంటుంది. ఇవాళ ముంబై వర్సెస్ ఆర్సీబీ మధ్య కీలక పోరు సాగనుంది.