టీడీపీ మహానాడులో విరాళాల వెల్లువ
NEWS May 29,2025 07:25 am
కడపలో జరిగిన టీడీపీ మహానాడులో విరాళాలు వెల్లువెత్తాయి. ఏకంగా ఆ పార్టీకి రూ. 22 కోట్లకు పైగా విరాళాలు స్వచ్చందంగా అందించారు నేతలు, కార్యకర్తలు, ఎన్నారైలు. తొలి రోజు పార్టీ చీఫ్, సీఎం చంద్రబాబు ప్రకటన చేయగానే పెద్ద ఎత్తున స్పందించారు. ఈ సందర్భంగా పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు చంద్రబాబు. దాతలకు పార్టీ రుణపడి ఉంటుందని స్పష్టం చేశారు. వచ్చిన విరాళాలతో పేదలు, కార్యకర్తల సంక్షేమానికి ఖర్చు చేస్తామన్నారు.