తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కడపలో జరుగుతున్న ఆ పార్టీ మహానాడులో అధ్యక్ష ఎన్నికపై చర్చ జరిగింది. ఈ సందర్బంగా ఎలాంటి ఓటింగ్ లేకుండానే ఏకగ్రీవంగా బాబును తమ పార్టీకి నాయకుడిగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు పార్టీ ఎన్నికల కమిటీ చైర్మన్ వర్ల రామయ్య.