సీఎం రేవంత్ మంత్రులకు విందు
NEWS May 29,2025 06:06 am
సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో మంత్రులకు విందు ఇచ్చారు. ఈ నెల 30న మంత్రివర్గ విస్తరణ, కార్యవర్గ కూర్పుపై అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఈ మేరకు నేతలకు పిలుపు వచ్చింది. దీంతో డిన్నర్ పార్టీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేబినెట్ విస్తరణ జరిగితే ప్రస్తుతం ఉన్న మంత్రులలో ఇద్దరిని తొలగించాల్సి ఉంటుంది. జూన్ మొదటి వారంలో కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ ఉంటుంది. ఇందులో ఎవరికి ఛాన్స్ దక్కుతుందోనని ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం బీసీ వాదం బలంగా వినిపిస్తోంది.