ఎండపల్లి మండల కేంద్రానికి చెందిన సబ్బ శంకరమ్మ (55)ను కోతులు గాయపరిచాయి. ఈ ఘటనలో ఆమె చేతికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను 108 ద్వారా హాస్పిటల్ కి తరలించారు. ఎండపల్లిలో గతంలోనూ అనేక మందిపై కోతులు దాడి చేశాయి. కోతుల బెడద నుంచి రక్షించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.