మంద కృష్ణ మాదిగ సన్మాన సభను విజయవంతం చేయాలి
NEWS May 28,2025 11:53 pm
పాతికేళ్ళ సామాజిక అసమానతలపై పోరాటాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం మంద కృష్ణ మాదిగకు పద్మ శ్రీ అవార్డును ప్రదానం చేసింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్న అనంతరం ఈ నెల 31న వరంగల్ కు వస్తున్న నేపథ్యంలో ఘన స్వాగతంతో పాటు అక్కడ ఏర్పాటు చేసే జాతీయ స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని MRPS ప్రతినిధులు కోరారు. జిల్లా మహిళా అధ్యక్షురాలు సత్తిగారి లక్ష్మి, కొత్తోల్ల యాదగిరి, బట్ట వెంకట్ రాములు తదితరులు పాల్గొన్నారు.