పద్మశ్రీ మందకృష్ణకు కంగ్రాట్స్
NEWS May 28,2025 06:39 am
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ రాష్ట్రపతి చేతుల మీదుగా రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు అందుకున్నాడు. ఈ సందర్బంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లు అభినందనలతో ముంచెత్తారు. సామాజిక సమ న్యాయం కోసం మూడు దశాబ్దాల పాటు ఆయన చేసిన పోరాటం స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు. కృష్ణన్న భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.