ఇంటర్ పరీక్షల్లో ఆరుగురు విద్యార్థులు డిబార్
NEWS May 27,2025 10:11 pm
జగిత్యాల జిల్లాలో సోమవారం జరిగిన ఇంటర్ పరీక్షల్లో ఆరుగురు విద్యార్థులు డిబార్ అయినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి తెలిపారు. కథలాపూర్ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రంలో నలుగురు, కోరుట్ల గవర్నమెంట్ బాయ్స్ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రంలో ఇద్దరిని రాష్ట్ర పరిశీలన బృందం డిబార్ చేసినట్లు పేర్కొన్నారు.