జిల్లాలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటి వరకు 12 లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసినట్లు DRDO రఘువరన్ పేర్కొన్నారు. పెగడపల్లి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏపీఎం సమతతో కలిసి ఆయన పరిశీలించారు. జిల్లాలో కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్నాయన్నారు. మరో 50 వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేస్తామని తెలిపారు.