మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పై సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం పై దాడి కేసులో 127వ ముద్దాయిగా చేర్చారు. మరో వైపు రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో వైసీపీ నేతలకు చుక్కలు చూపిస్తోంది కూటమి సర్కార్. ఇప్పటికే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పై కూడా కేసు నమోదైంది. తను ప్రస్తుతం తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. మరో వైపు మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు.