సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి వందే భారత్ స్లీపర్
NEWS May 27,2025 05:00 pm
సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి వందే భారత్ స్లీపర్ నడిపేందుకు రైల్వేశాఖ ప్లాన్ చేసింది. 1667 కి.మీ దూరాన్ని ఒక్క రోజులోనే చేరనుంది ఈ రైలు. ఢిల్లీలో రాత్రి 8.50కు బయల్దేరే ఈ రైలు తర్వాతి రోజు రాత్రి 8 గంటలకు సికింద్రాబాద్ కు చేరుకుంటుంది. థర్డ్ AC ధర రూ. 3600, సెకండ్ AC రూ. 4800, ఫస్ట్ AC రూ. 6 వేలు వరకూ టిక్కెట్ ధర నిర్ణయించింది. ఆగ్రా, గ్వాలియర్, ఝాన్సీ, భోపాల్, ఇటార్సి, నాగ్పూర్, బల్లార్ష, కాజీపేట స్టేషన్లలో ఆగుతుందని పేర్కొంది.