రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫోకస్ పెట్టనున్నారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నారు. జూన్ 9 నుంచి మూడు విడతలుగా పర్యటిస్తారు. చిత్తూరు జిల్లా నుంచి తొలి పర్యటన ప్రారంభిస్తారు. జూన్ 30న మచిలీపట్నంలో పర్యటన ముగింపు సభ ఉంటుందన్నారు షర్మిల.