ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు కేడీసీసీ (సొసైటీ బ్యాంకు)లో కోట్లలో నిధులు గోల్ మాల్ అయ్యాయని రైతులు ఆరోపించారు. ఏప్రిల్ 30న రిటైర్ అయిన సొసైటీ కార్యదర్శి పాత్రపై విచారణ జరిపాలని డిమాండ్ చేశారు. సోమవారం బ్యాంకు ఆవరణలో దస్త్రాలకు నిప్పు పెట్టడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రికార్డుల తనిఖీ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని కేడీసీసీ బ్యాంక్ మేనేజర్ వెల్లడించారు.