తెలుగు రాష్ట్రాలను తాకిన నైరుతి రుతుపవనాలు
NEWS May 26,2025 02:28 pm
13 రోజులు ముందుగానే తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చాయి రుతు పవనాలు. మహబూబ్ నగర్ వరకు విస్తరించినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది . ఏపీలోని రాయలసీమను తాకాయి. కేరళ, కర్నాటక, తమిళనాడులో పూర్తిగా విస్తరించాయి. మహారాష్ట్ర, తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో విస్తరణ. దక్షిణాదితో పాటు కొన్నిచోట్ల వర్షాలు దంచి కొడుతున్నాయి.