రాజీవ్ యువ వికాసం పథకంలో భాగంగా దరఖాస్తు చేసుకున్న బీసీ కార్పొరేషన్ అభ్యర్థులకు శనివారం మల్యాల ఎంపీడీవో ఆఫీసులో ఇంటర్వ్యూలు నిర్వహించారు. అభ్యర్థుల సర్టిఫికెట్లు, వారు పెట్టుకున్న యూనిట్, తదితర విషయాలను ఎంపీడీవో స్వాతి, ఎంపీఓ ప్రవీణ్, సంబంధిత బ్యాంకు అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఇంటర్వ్యూల కోసం పెద్ద ఎత్తున అభ్యర్థులు తరలి రావడంతో కార్యాలయం ఆవరణ కిక్కిరిసి పోయింది.