తిరుమలను దర్శించుకున్న భక్తులు 91,538
NEWS May 26,2025 08:18 am
తిరుమల భక్త బాంధువులతో కిట కిట లాడుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 91 వేల 538 మంది దర్శించుకున్నారు. 37 వేల 339 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.80 కోట్లు వచ్చినట్లు తెలిపారు టీటీడీ ఈవో శ్యామల రావు. స్వామి వారి దర్శనం కోసం ప్రస్తుతం ఏటీజీహెచ్ వరకు లైన్ కొనసాగుతోందని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు 18 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.