కొండగట్టు ఆలయ ముడుపుల ఆదాయం
NEWS May 25,2025 09:08 pm
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో పెద్ద జయంతి సందర్భంగా హనుమాన్ దీక్షాపరులు సమర్పించిన ఇరుముడులను (ముడుపులను) ఆదివారం ఈవో శ్రీకాంత్ రావు ఆధ్వర్యంలో కొంత భాగం విప్పారు. ఈ ముడుపుల ద్వారా రూ. 85,094 నగదు సమకూరినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పర్యవేక్షణ అధికారి రాజమౌళి, చంద్రశేఖర్, హరి హరనాథ్, పోలీసు సిబ్బంది, శ్రీవల్లి సేవాసమితి, తదితరులు పాల్గొన్నారు.