గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును ఆపాలి
NEWS May 25,2025 03:56 pm
ఏపీ ప్రభుత్వం చేపట్టిన గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును ఆపాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. 200 టీఎంసీల గోదావరి జలాలను తరలించుకు పోయే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కాళేశ్వరానికి కేంద్రం అన్ని అనుమతులు ఇచ్చినా చంద్రబాబు స్వయంగా లేఖలు రాశారని పేర్కొన్నారు. కోర్టులు, ట్రిబ్యూనల్స్ లో కూడా కేసులు వేశారని తెలిపారు.