కళాకారుల రంగంలో తను చేసిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం మిరియాల అప్పారావుకు వరించిందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కొనియాడారు. రావులపాలెం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరిగిన మిరియాల అప్పారావు సంస్మరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే సత్యానందరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా అప్పారావు తనకు తెలిసిన కళను ప్రదర్శించి ఎందరో అభిమానం సంపాదించుకున్నారన్నారు.