వెంకన్న అన్నదాన భవన నిర్మాణానికి భారీ విరాళం
NEWS May 25,2025 06:33 pm
కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి వెంకటేశ్వరస్వామి వారి అన్నదాన భవన నిర్మాణానికి ఆదివారం పెదకాకాని వాస్తవ్యులు కొండ్రగుంట రవి, వర మల్లేశ్వరి వారి కుటుంబ సభ్యులు 1,00,116 రూపాయలు విరాళంగా అందించారు. వీరికి ఆలయ అర్చక బృందం ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామి చరిత్ర గురించి వివరించారు. డిప్యూటీ కమిషనర్ నల్లం చక్రధర్ రావు, సిబ్బంది స్వామివారి చిత్రపటం అందించారు.