అస్తిత్వం కోసమే కవిత ఆరాటం
NEWS May 25,2025 01:12 pm
బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ నిప్పులు చెరిగారు. ఎమ్మెల్సీ కవితపై ఫర్ అయ్యారు. ఆమె అస్తిత్వం కోసమే ఆరాట పడుతోందన్నారు. ఒకప్పుడు అన్నలు వదిలిన బాణాలే ఇప్పుడు తిరగ బడుతున్నాయంటూ ఎద్దేవా చేశారు. ఏపీలో జగన్ పై షర్మిల ఎక్కుపెడితే, తెలంగాణాలో కవిత కేటీఆర్ మీద బాణాలు సంధిస్తోందన్నారు. ప్రజల అవసరాల కంటే కుటుంబ అవసరలు, వారసత్వమే ముఖ్యమనే తీరులో వైఎస్, కేసీఆర్ ఫ్యామిలీలు రచ్చకెక్కడం బాధాకరమన్నారు.