కుప్పంలో సీఎం నూతన గృహ ప్రవేశం
NEWS May 25,2025 11:26 am
కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలో గృహ ప్రవేశం చేశారు సీఎం చంద్రబాబు, నారా లోకేష్ దంపతులు. కోడలు నారా బ్రాహ్మణి కొత్త ఇంట్లో పాలు పొంగించారు. ఈ సందర్భంగా కుప్పం గృహ ప్రవేశానికి నియోజకవర్గ నలుమూలల నుంచి ప్రజలు వచ్చారు. తమ సొంతింటి పండుగలా పాల్గొనడం చాలా సంతోషాన్నిచ్చిందని బ్రాహ్మణి పేర్కొన్నారు. ఇంత మంది ఆత్మీయుల ఆశీర్వాదం అందుకోవడం నిజంగా అదృష్టం అని, వారి అభిమానానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.