మిస్ మిల్లీ మాగీ ఆరోపణలపై విచారణ చేపట్టాలి
NEWS May 25,2025 11:23 am
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో నిర్వహిస్తున్న అందాల పోటీలపై మిస్ ఇంగ్లండ్ మిల్లీ మాగీ సంచలన ఆరోపణలు చేయడం కలకలం రేపింది. తనను వేశ్య లాగా చూశారంటూ నిర్వాహకులపై ధ్వజమెత్తింది. ఈ మొత్తం వ్యవహారంపై వెంటనే విచారణ చేపట్టాలని, దోషులు ఎవరో, వేధింపులకు గురి చేసింది ఎవరో తేల్చాలన్నారు మాజీ మంత్రి. ఆమె కామెంట్స్ తో హైదరాబాద్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యిందన్నారు.