కాక కుటుంబంపై గజ్జెల కాంతం ఫైర్
NEWS May 24,2025 04:29 pm
కాక కుటుంబంపై కాంగ్రెస్ నేత గజ్జెల కాంతం ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో దళితుల సంక్షేమాన్ని విస్మరించిన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి మంత్రి పదవి కోసం దిగజారి ప్రవర్తిస్తున్నాడని గజ్జెల కాంతం ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత డబ్బులతో తన కుటుంబంలో 2 ఎమ్మెల్యేలు, ఎంపీ పదవిని కొనుక్కున్నట్లు ఆరోపించారు. తనకు మంత్రి పదవి కోసం హైదరాబాదులో బహిరంగ సభ పెట్టి మాలలందరిని రెచ్చగొట్టినట్లు ఆరోపించారు.