కవిత లేఖ రాయడంపై సీరియస్ గా స్పందించారు మాజీ మంత్రి కేటీఆర్. పరోక్షంగా ఆమెను హెచ్చరించారు. పార్టీలో సూచనలు చేయాలని అనుకుంటే ఎవరైనా లేఖలు రాయొచ్చ న్నారు. అంతర్గతంగా మాట్లాడుకునే విషయాలు బయట మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. తమ పార్టీలో ప్రజాస్వామిక స్ఫూర్తి ఉందన్నారు.