మల్యాల వడ్డెర కాలనీకి చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన బోదాసు శంకర్ (37) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ నరేశ్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి బంధువులు అందుబాటులో లేకపోవడంతో మృతదేహాన్ని జగిత్యాల మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేయలేదన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.