విజయవాడలోని బీసెంట్ రోడ్డులో బాంబు పెట్టామంటూ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేశాడు గుర్తు తెలియని వ్యక్తి. దీంతో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు బాంబ్ స్క్వాడ్. షాపులను మూసి వేయించారు. ఎవరూ కూడా బయటకు రావద్దంటూ హెచ్చరించారు. దీంతో ఏం జరుగుతుందో తెలియక ప్రజలు ఆందోళనకు గురయ్యారు.