సజ్జల భార్గవ రెడ్డిపై సుప్రీం సీరియస్
NEWS May 24,2025 10:00 am
వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ సజ్జల భార్గవరెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడింది సుప్రీంకోర్టు. సామాజిక మాధ్యమాలలో అసభ్య పోస్టులకు సంబంధించిన కేసుల్లో తనకు బెయిల్ ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది. ఆలోపు ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని ఆదేశించింది. కేవలం 2 వారాల గడువు మాత్రమే ఇచ్చింది. ఎలా పడితే అలా పోస్టులు పెడితే ఎలా అని ప్రశ్నించింది. ఎవరు చేసినా తప్పేనని పేర్కొంది.
జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.