ఢిల్లీలో కరోనా ఎఫెక్ట్ 23 కేసులు
NEWS May 23,2025 07:59 pm
కరోనా ఎఫెక్ట్ కొనసాగుతోంది. దేశంలోని పలు ప్రాంతాలలో కొన్ని కేసులు నమోదయ్యాయి. కేరళ, ఏపీ తెలంగాణలో ఈ కేసులు నమోదు కాగా తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఏకంగా 23 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అత్యవసర సమావేశం నిర్వహించింది. ముందు జాగ్రత్తగా మాస్క్ లు ధరించాలని సూచించింది.