ఆడ బిడ్డలను కోటీశ్వరులను చేస్తా
NEWS May 23,2025 04:49 pm
ఆడ బిడ్డలను కోటీశ్వరులు చేయడమే తన ముందున్న లక్ష్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ దిశగా సర్కార్ ప్రయత్నం చేస్తోందన్నారు. మెదక్ జిల్లాకు అవసరమైన సాగు, తాగునీరు, పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రైతుల అప్పుల బాధ నుంచి విముక్తి కలిగించామన్నారు. ఉచిత బస్సు ప్రయాణంతో మహిళల కష్టాలు తీర్చామన్నారు.