ప్రకాశం జిల్లా రోడ్డు ప్రమాదంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ ఆరా తీశారు. ఘటనలో ఆరుగురు మృతి చెందడంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మంత్రి రాంప్రసాద్ సంతాపం తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. సహాయక చర్యలు చేపట్టాలని రవాణా అధికారులకు ఫోన్ చేసి సూచించారు. రోడ్డు భద్రత కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.